రానున్న పరీక్షా కాలంలో విద్యార్థులను మానసిక, శారీరక ఒత్తిడి మరియు డ్రగ్స్ మహమ్మారి నుండి దూరం చేసేందుకు నెల్లూరు నగరంలో జరిగిన తలిదండ్రుల రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
✨ ప్రధాన తీర్మానం:
విద్యార్థి-తలిదండ్రుల ప్రత్యేక సమావేశాలు: జిల్లా, రాష్ట్రం లోని ప్రతి పాఠశాల మరియు కళాశాలలో ప్రత్యేక "విద్యార్థి-తలిదండ్రుల" సమావేశాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
సహాయ సహకారాలు: ఈ కార్యక్రమాలను ప్రభుత్వ సహకారంతో పాటు, ప్రముఖ సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ మరియు స్వచ్ఛంద సంస్థల సహాయంతో నిర్వహించనున్నారు.
🤝 నిర్వహణ:
ఈ తీర్మానాన్ని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) (రిజిస్టర్ నెంబర్ 6/2022) యొక్క ఆంధ్రప్రదేశ్ కమిటీ రూపొందించి, పోస్టర్ను విడుదల చేసింది.