ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత … జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ .

 ముఖ్యమంత్రి  పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత … జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ . 

• 1700  మంది పోలీసులతో భారీ బందోబస్తు.

• పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.

• బందోబస్తుకు విచ్చేసిన పోలీసులకు దిశా నిర్దేశం చేసిన  ... జిల్లా ఎస్పీ.

2025  మే 17 న ( శనివారం)  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  నారా చంద్రబాబు నాయుడు   కర్నూలు పట్టణంలో  పర్యటించనున్న నేపథ్యంలో  బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీసులకు జిల్లా ఎస్పీ   విక్రాంత్ పాటిల్   నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని  కేంద్రీయ విద్యాలయం  కు ఎదురుగా ఉన్న  మెగా సిరి ఫంక్షన్ హాల్ లో పలు సూచనలు, సలహాలు చేసి దిశా నిర్దేశం చేశారు.  

ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ    మాట్లాడుతూ...

కర్నూలు పట్టణంలో  ముఖ్యమంత్రి   పర్యటించే  రూట్ & రూఫ్ - టాప్ ప్రాంతాలలో, సిఎం కాన్వాయ్,    సభ  ప్రాంగణం ,  తదితర ప్రాంతాలలో  బందోబస్తు విధులు నిర్వహించే మఫ్టీ పోలీసులు ,  స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు , పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసు అధికారులు , పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.   
ఏలాంటి సంఘటనలు జరగకుండా భద్రత పరంగా పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. 
వాహనాల పార్కింగ్,  ట్రాఫిక్  ఇబ్బందులు కలగకుండా  చూసుకోవాలన్నారు. 
చేయకూడనవి, చేయవలసిన వాటికి గురించి తెలిపారు. 
అడిషనల్ ఎస్పీలు  4 గురు  , 11  మంది డిఎస్పీలు, 53  మంది సిఐలు,  101  మంది ఎస్సైలు , 383   మంది  ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుళ్ళు , 680 మంది కానిస్టేబుళ్ళు , 51   మంది మహిళా పోలీసులు, 416  మంది హోంగార్డులు, 5 సెక్షన్ల ఏ ఆర్ సిబ్బంది, 6 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించారు.
కర్నూలు జిల్లా ఎస్పీ  తో  అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్  కర్నూలు రేంజ్ పరిధిలోని అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు,  సిఐలు, ఎస్సైలు , పోలీసు సిబ్బంది ఉన్నారు.