కళ్ళు మూసుకొని చోద్యం చూస్తున్న అధికారులు.......!
కర్నూలు క్రైమ్ ప్రతినిధి ( న్యూస్ జూన్ 5)
దేవనకొండ మండలం వేలంకూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో వంక వాగుల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న దళారులు ...
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు ..
రాత్రి పగలు అని తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు ప్రతిరోజు 50 ట్రాక్టర్ల నుండి 100 ట్రాక్టర్ల వరకు ఇసుక రవాణా జరుగుతుంది. ఒక్కొక్క ట్రాక్టర్ ఇసుక 2000 రూపాయల నుంచి 2500 రూపాయలు అమ్ముతున్న దళారులు ఇంత పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న పట్టించుకోవడంలేదని దేవనకొండ గ్రామ ప్రజలు పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు వాపోతున్నారు. దేవనకొండ ఎమ్మార్వో కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న వంకలో ప్రతినిత్యం అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది ఈ ఇసుక రవాణా గ్రామ స్థాయి నాయకుల అండదండలతో నడుస్తుందని ప్రజలు అంటున్నారు వెలంకూరు గ్రామ సర్పంచ్ కనుసనల్లో ఈ అక్రమ రవాణా జరుగుతుందని ప్రజలు అన్నారు
ఇంత పెద్ద స్థాయిలో భారీ ఇసుక రవాణా జరుగుతున్న అటు రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ కన్నెత్తి చూడడం లేదని
ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న విషయం పై అధికారులకు చెప్పుదామని ఎవరైనా వెళ్లిన అటువైపు చూసిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అవసరమైతే వారిపై దాడి చేయడానికి కూడా వెనకాడడం లేదని ప్రజలు అంటున్నారు
ఈ ఇసుక ట్రాక్టర్ల రాకపోకలు జరుగుతుండడంతో ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని ఈ అక్రమ ఇసుక రవాణా రాత్రి 12 గంటల తర్వాత కూడా జరుగుతుందని ఈ ట్రాక్టర్ల ధ్వని కాలుష్యం వలన రాత్రి సమయంలో చిన్న పిల్లలకు వృద్ధులకు గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఎంతో ఇబ్బందికరంగా మారిందని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు
ఈ ట్రాక్టర్ల రాకపోకల వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు
ఇంత పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని అన్న సమాచారం మేరకు వివరణ ఇవ్వవలసిందిగా దేవనకొండ ఎమ్మార్వో ను అడుగగా విస్తుపోయే విధంగా సమాధానం ఇచ్చారు
నేను ఇక్కడికి ఎమ్మార్వో గా బదిలీ అయి వచ్చి మూడు నెలలు మాత్రమే అయిందని ఇక్కడ ఎలాంటి అక్రమ ఇసుక రవాణా కార్యకలాపాలు జరుగుతున్నాయో తనకు తెలియదని తన దృష్టికి ఇంతవరకు అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న విషయం కూడా రాలేదని అసలు ఇక్కడ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందా......?అని తిరిగి ప్రశ్నించడం ఎంతో హాస్యాస్పదంగా ఉంది
దేవనకొండ ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చి మూడు నెలలు అవుతున్న అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్న
ఎమ్మార్వో ఇది ఎంతవరకు నిజం?
ఈ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న విషయం విఆర్ఓ ను అడిగి తెలుసుకుంటానని విఆర్ఓ ను పిలిపించి వివరణ అడగగా
వేలంకూరు గ్రామ పరిధి విఆర్ఓ ఇచ్చిన వివరణ అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న విషయం తెలుసని కానీ అది రాత్రిపూట మాత్రమే జరుగుతుందని ఆ రాత్రిపూట తలారులను పంపించి ఇసుక రవాణా జరగకుండా అడ్డుకుంటున్నామని కానీ ఉదయం పూట అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారన్న విషయం తనకు తెలియదని వీఆర్వో అన్నారు సదరు విఆర్ఓ కు తెలిసిన సమాచారం ఎమ్మార్వో కు తెలియక పోవడం గమనార్హం ....? మరి ఆ విఆర్ఓ ఎందుకు అక్రమ ఇసుక రవాణా గురించిన సమాచారము ఎమ్మార్వో దృష్టికి తీసుకు వెళ్లలేదు అన్న విషయము ప్రశ్నార్ధకంగా మారింది.....
వీఆర్వో ను మరి ఎమ్మార్వో కు మీరు ఈ విషయము తెలియపరిచారా లేదా అని అడగగా వెంటనే ఎమ్మార్వో కల్పించుకొని గతంలో ఒకసారి
ఆర్ ఐ తలారులు ఇసుక రవాణాను అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు వారిపై దాడులు చేశారని చెప్పడం విచిత్రంగా ఉంది తనకు అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది అన్న విషయము తెలియదని చెప్పిన ఎమ్మార్వో తిరిగి ఆర్ఐ తలారులపై దాడికి ప్రయత్నించారు అని చెప్పడం గమనార్హం
ఒకే వ్యవహారంపై ఎమ్మార్వో రెండు రకాలుగా మాట్లాడడం ఎంతో హాస్యాస్పదం
ఇకపై ఇలాంటి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న విషయం తన పరిధిలోకి వస్తే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటాను అని చెప్పిన మాట దాటవేసిన ఎమ్మార్వో..
ఈ అక్రమ ఇసుక రవాణా వ్యవహారము అధికారులకు ఎంతెంత థాయిలాలు ముట్టుతున్నాయో లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక అన్నట్టుగా ఉంది............