...వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ లో వేల కోట్ల రూపాయల దుర్వినియోగనికి పాల్పడింది
...2028 కంతా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తాం
....గ్రామాల అభివృద్ధికి కట్టు బడి ఉన్నాం ...ఎం.పి బస్తిపాటి నాగరాజు
జల్ జీవన్ మిషన్ పథకం కింద 2028 కంతా ప్రతి ఇంటికి నీటి కుళాయి కనెక్షన్లు ఇస్తామని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు..ఆస్పరి మండలంలోని డి.కోటకొండ గ్రామంలో
నాబార్డు నిధులు రూ 1.20 కోట్లతో కోటకొండ నుంచి చిన్న పెండేకల్లు గ్రామం వరకు రోడ్డు పునర్నిర్మానంతో పాటు ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులు రూ.6.70 కోట్లతో ఆలూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సీ.సీ రోడ్ల నిర్మాణానికి ఆలూరు నియోజకవర్గం టిడిపి ఇంచార్జి వీరభద్ర గౌడ్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేసారు..ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ లో వేల కోట్ల రూపాయల దుర్వినియోగనికి పాల్పడిందని విమర్శించారు.. జగన్ పాలనలో సరైన రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు..కూటమి ప్రభుత్వం అధికారం రాగానే యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేపట్టడం తో పాటు కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టిందన్నారు... గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామాని , గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.. ఈ కార్యక్రమం లో ఆస్పరి మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..