మీదివేముల గ్రామంలోని బోయ రమేష్ నాయుడు హత్య కేసులోని ముద్దాయిలు అరెస్టు......కర్నూలు ఇంచార్జి డిఎస్పి కె . శ్రీనివాసాచారి.కర్నూల్ రూరల్ సర్కిల్ ఆఫీస్ లో వివరాలు వెల్లడించిన... కర్నూల్ ఇంచార్జి డిఎస్పి.నలుగురు అరెస్టు, ఒక బైకు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం.



 మీదివేముల గ్రామంలోని బోయ రమేష్ నాయుడు  హత్య కేసులోని ముద్దాయిలు అరెస్టు......
కర్నూలు ఇంచార్జి డిఎస్పి కె . శ్రీనివాసాచారి.

కర్నూల్ రూరల్ సర్కిల్ ఆఫీస్  లో వివరాలు వెల్లడించిన... కర్నూల్ ఇంచార్జి డిఎస్పి.

నలుగురు అరెస్టు, ఒక బైకు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం.


కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసు స్టేషన్ పరిధిలో మీదివేముల గ్రామస్తుడు బోయ రమేష్ నాయుడు, వయసు 48 సం.లు, s/o లేట్ లక్ష్మన్న ను 05.06.2025 వ తేదినాడు రాత్రి సుమారు 9.40 గంటల సమయంలో నన్నూరు గ్రామం నుండి మీదివేముల గ్రామానికి తన హోండా ఆక్టివా మోటార్ సైకిల్ పైన వెళుతూ ఉండగా దారిలో రచన గ్రీన్ టౌన్-1 వెంచర్ ఎదురుగా అతన్ని అడ్డుకొని బీరు సీసాలతో కొట్టి పక్కన ఉన్న పొలంలో పడేసి పెద్ద బండ రాళ్ళతో తల పైన కొట్టి హత్య చేసినారు అతని భార్య బోయ లక్ష్మి దేవి ఇచ్చిన ఫిర్యాదు పైన 06.06.2025 వ తేదినాడు ఓర్వకల్లు పోలీసు స్టేషన్ యందు  FIR No: 116/2025 u/sec. 103 (1), 126 (2) 351 (3) r/w 3 (5) BNS గా మీదివేముల గ్రామస్తులు 1) మేడం రామాంజనేయులు, 2) మేడం తిరుపాలు, 3) బోయ బుగ్గరాముడు s/o వెంగన్న, 4) మేడం నాయుడు s/o తిరుపాలు, 5) మేడం రాజు, s/o ఆంజనేయులు, 6) మేడం శ్రీనివాసులు s/o నాగన్న ల పైన కేసు నమోదు చేయడం జరిగినది. 
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశములతో కర్నూలు ఇంచార్జీ SDPO శ్రీనివాసాచారి  ఆద్వర్యంలో కర్నూలు రూరల్ సర్కిల్ CI M.చంద్రబాబు నాయుడు  సాంకేతిక పరిజ్ఞానం మరియు CC కెమెరాలను ఆధారంగా చేసుకొని విచారణ చేసి పరారీలో ఉన్న ముద్దాయిల గురించి రాబడిన సమాచారంతో సి.ఐ. , ఓర్వకల్లు యస్.ఐ. యు.సునిల్ కుమార్  సిబ్బందితో కలసి వెళ్ళి ఈ రోజు అనగా 11.06.2025 వ తేదినాడు మధ్యాహ్నం 1 గంటకు ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామం శివారులో కొత్త మిద్దె బావి వద్ద  ముద్దాయిలు (1) మేడం రామాంజనేయులు, వయసు 37 సం!!లు, తండ్రి లేట్ వెంకట రాముడు (A1). (2) మేడం తిరుపాలు, వయసు 65 సం!!లు, s/o లేట్ మేడం నాగన్న, (A2). (3) మేడం శ్రీనివాసులు @ శ్రీను, వయసు 50 సం!!లు, s/o లేట్ మేడమ్ నాగన్న (A-6),  మేడమ్ రామకృష్ణ @ ఎర్రోడు , వయసు 23 సం!!లు, s/o మేడమ్ శ్రీనివాసులు @ శ్రీను, (A7) అందరిదీ మీదివేముల గ్రామము, ఓర్వకల్లు మండలము లను అరెస్టు చేసినారు. 
మేడం రామాంజనేయులు తనకు రాజకీయంగా బోయ రమేష్ నాయుడు అడ్డం వస్తున్నాడు అని, తమ బందువులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములు APIIC వారు తీసుకొనగా దానికి డబ్బులు రాకుండా అడ్డుపడినారు అని కోపంతో తన స్వంత చిన్నాయన లు అయిన మేడం తిరుపాలు, మేడం శ్రీనివాసులు మరియు శ్రీనివాసులు చిన్న కొడుకు మేడం రామక్రిష్ణ ల సహకారంతో ఒంటరిగా వస్తున్న రమేష్ నాయుడిని అడ్డుకొని, బీరు సీసా తో ముఖం పైన కొట్టి, తరువాత పొలం గట్టున ఉన్న పెద్ద బండ రాళ్ళతో రామాంజనేయులు మరియు రామక్రిష్ణ లు కొట్టి చంపినాము అని, తిరుపాలు శ్రీనివాసులు రోడ్డు పైన నిలబడి వారికి కాపలాగా ఉన్నారు అని తమ నేరము ఒప్పుకొన్నారు.  
గతంలో కూడా మేడం రామాంజనేయులు 2015 లో మృతుడు రమేష్ నాయుడి పైన దాడి చేసినాడు ఆ కేసులో వారు రాజీ కావడం జరిగినది.   మేడం తిరుపాలు 1994 లో జరిగిన రాముడు హత్య కేసులో A-8 ముద్దాయి అని హైకోర్టు అతనికి జీవిత ఖైదు విదించడంతో 2001 నుండి 2009 వరకు జైలు శిక్ష అనుభవించి క్షమాభిక్ష పైన విడుదలైనాడు.  
రమేష్ నాయుడి హత్య కేసులో మిగిలిన ముద్దాయిల పాత్ర గురించి కూలంకశంగా విచారించి వారి పైన చట్ట ప్రకారం తగిన చర్య తీసుకొనబడును.  
ఈ కేసును త్వరితగతిన విచారణ చేసి ముద్దాయిలను అరెస్టు చేసిన CI M.చంద్రబాబు నాయుడు ని, ఓర్వకల్లు SI U.సునిల్ కుమార్ మరియు వారి సిబ్బంది HC జి.ప్రతాప్ కుమార్, R.సుబ్బరాయుడు, PCలు P.కిరణ్, S.సమీర్, K.రవీంద్ర సింగ్ లను కర్నూలు ఇంచార్జీ SDPO శ్రీనివాసాచారి  అభినందించినారు.