విజయనగరం జిల్లా పేరెంట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఆకుల దామోదర రావు గారు నియామకం...
పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రకటన
విజయవాడ, జూన్ 25:
పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) రాష్ట్ర కమిటీ విజయనగరం జిల్లాకు కొత్త కార్యదర్శిగా నియమించింది. ఈ బాధ్యతకు ఆకుల దామోదర రావు గారిని నియమిస్తున్నట్లు రాష్ట్ర కమిటీ ప్రకటించింది. తల్లిదండ్రుల సమస్యలను ప్రభుత్వానికి తెలపడం, విద్యా రంగంలో శాశ్వత మార్పులు తీసుకురావడం వంటి ముఖ్యమైన లక్ష్యాలతో పనిచేస్తున్న PAAP కమిటీ, జిల్లా స్థాయిలో సంఘటితంగా తల్లిదండ్రులను సమీకరించి విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా అతని పై కమిటీ నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులతో కమిటీ నిర్మాణం, నాయకత్వ లక్షణాలు కలిగిన వారిని ఎదగజేయడం వంటి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దామోదర రావు మాట్లాడుతూ పేరెంట్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (PAAP) తన మీద నమ్మకంతో తనకు ఇచ్చిన జిల్లా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని చదువుతున్న విద్యార్థులు వారు చదువుతున్న పాఠశాలలలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావచ్చని ఆయన అన్నారు. నాకు ఈ బాధ్యతను అప్పగించిన పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శిఖరం నరహరి గారికి, కార్యదర్శి ఈశ్వరయ్య గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.