జిల్లా పోలీసు కార్యాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన ... కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్
V3 టివి న్యూస్ కర్నూలు :
జిల్లా పోలీసు కార్యాలయం ను కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ తనిఖీలలో భాగంగా డిపిఓ లోని అన్ని విభాగాల పనితీరు గురించి సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు.
డిపిఓలోని సిసి కెమెరాల కంట్రోల్ రూమ్, డయల్ 100 రూమ్, డి.సి.ఆర్.బి , ఆర్మ్ డు రిజర్వుడు ఆయుధాల బెల్లఫాం, పోలీసు క్యాంటిన్, ఫుడ్ కోర్టు, గ్యాస్ గోడౌన్, జిమ్ సెంటర్, వాటర్ ప్లాంట్ తదితర పరిసరాలను జిల్లా ఎస్పీ పరిశీలించి పోలీసు అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాస రావు, పిసిఆర్ సిఐ శివశంకర్ , డిసిఆర్ బి సిఐ గుణశేఖర్ బాబు, కోర్టుమానిటరింగ్ సిఐ రామయ్యనాయుడు, ఆర్ ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు ఉన్నారు.