విద్యార్దులు చదువులో ఉన్నత స్ధాయికి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ *

పార్వతీపురం మన్యం జిల్లా కురపాం నియోజవర్గం
V3 న్యూస్ మీడియా. జులై29
*విద్యార్దులు చదువులో ఉన్నత స్ధాయికి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ *విప్ కురుపాం *నియోజకవర్గం *MLA శ్రీమతి తోయక జగదీశ్వరి  అన్నారు.* మంగళవారం నాడు జియమ్మవలస మండలం పెదమేరంగి జంక్షన్ లో గల తిరుమల సాయి హై స్కూల్లో 2024 - 2025 విద్యా సంవత్సరంలో నవోదయ సీట్లు సాధించిన విద్యార్థులకు MLA జగదీశ్వరి  సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. పాఠశాలలో పని చేస్తున్న మహిళ ఉపాధ్యాయ సిబ్బందికి యూనిఫామ్ చీరలు అందజేశారు. ఈ సందర్బంగా నూతనంగా నిర్మించిన పాఠశాల ముఖాద్వారాన్ని కూడా ప్రారంభించారు. MLA జగదీశ్వరి  మాట్లాడుతూ క్రమశిక్షనతో విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగి పాఠశాలకు మంచి పేరు ప్రాక్యతలు తేవాలని ఆమె కోరారు. తిరుమల సాయి హై స్కూల్ లో చదువుకున్న 12 మంది విద్యార్థులకు నవోదయ సీట్లు రావడం అభినందనీయమన్నారు. ఇప్పటి వరకు ఈ పాఠశాల నుంచి నవోదయకు 137 మంది ఎంపిక కావడం హర్షనియమని తెలిపారు. ఈ కార్యక్రమం లో పాఠశాల కరస్పాండంట్ రౌతు సరళ కుమారి . పాఠశాల ఎకడమిక్ డైరెక్టర్ శ్రీ రౌతు వెంకటరమణ . పాఠశాల ప్రధానుపాధ్యాయులు సతివాడ శంకర రావు  ,ఉపాద్యాయులు మరియు తల్లిదండ్రులు, నాయకులు పాల్గున్నారు.